పాశమైలారం సిగాచీ పరిశ్రమను సీఐటీయూ నాయకులు సందర్శించారు. ప్రమాద ఘటనపై సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. పని గంటలు పెంచి కార్మికులను యాజమాన్యం దోచుకు తింటుందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు