కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ను శుక్రవారం మొల్ల సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు గానుగపెంట హనుమంతరావు కలిశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష సంపూర్ణ అమలుకు చర్యలు తీసుకోవాలని, తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ను కోరారు. కడప జిల్లా తెలుగు సాహిత్య కథనాల పుట్టిన నిలయని తెలిపారు. విశ్వవిద్యాలయంలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మొల్ల జయంతి కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలియజేసారు.