నూతన సంవత్సరం పురస్కరించుకొని కనిగిరి డివిజన్ పరిధిలో ఆకతాయి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని యువతను డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ హెచ్చరించారు. మంగళవారం పామూరు సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పి నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని కీలక అంశాలను వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన లేదా సైలెన్సర్లు తీసేసి అధిక శబ్దాన్ని కలిగించే విధంగా వ్యవహరించిన కఠినంగా వ్యవహరిస్తామని డి.ఎస్.పి ప్రజలను హెచ్చరించారు.