పూతలపట్టు: తవణంపల్లి మండల కేంద్రంలో 120వ మహాభారత యజ్ఞ మహోత్సవ ధ్వజారోహణం
తవణంపల్లి మండల కేంద్రంలోని శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో 120వ మహాభారత మహోత్సవ ధ్వజారోహణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గుడిసె మునస్వామి శెట్టి మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు శుభవేళలో ధ్వజారోహణం నిర్వహించామని తెలిపారు. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 13, 2025 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు మహాభారత హరికథ జరుగుతుందని తెలిపారు. ఏ. శారద భాగవతలని హరికథ కాలక్షేపం చేస్తారని వివరించారు. సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బక్కసుర బలి బండి ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు ప్రతిరోజ