వాల్మీకుల ఎస్టీ హక్కుల పునరుద్ధరణపై పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 9న నంద్యాలలో జరగబోయే మౌన దీక్షను విజయవంతం చేయాలని డోన్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మన్నెపు బాలరంగయ్య పిలుపునిచ్చారు. మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్ష ద్వారా తమ భావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వాల్మీకి నాయకులు పాల్గొన్నారు.