తాడిపత్రి లోని అతి పురాతనమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో గురువారం అఖండ దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అఖండ దీపోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు అఖండ దీపోత్సవాన్ని వెలిగించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంతో పాటు పరిసరాలు ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. భక్తుల కోలాహలం నెలకొంది.