బోథ్: బాబేరతాండలో చిరుత దాడితో నాలుగు మేకలు మృతి
Boath, Adilabad | Nov 29, 2024 చిరుత పులి దాడి ఘటనలో నాలుగు మేకలు మృతి చెందిన ఘటన బోత్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బాబేరతాండలో గురువారం అర్ధరాత్రి మేకల మందపై చిరుతపులి దాడి చేసి నాలుగు మేకలను చంపేసింది. మేకల అరుపులకు గ్రామస్థులు మేల్కొనగా వారి అలికిడితో చిరుతపులి పారిపోయింది. చిరుతపులి సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్నామని గ్రామస్థులు తెలిపారు.