అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఆయన ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాలు నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలు చట్టవిరుద్ధమైన వ్యవహారాలను నడిపితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించి సంక్రాంతి పండుగను జరుపుకోవాలన్నారు.