తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం బీచ్ వద్ద సముద్రం 50 మీటర్లు ముందుకు వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలోకి పర్యాటకులు రాకుండా పోలీసులు నిషేధించారు. సముద్రం ఉధృతంగా ఉండడంతో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండడంతో పర్యాటకులు ఎవరిని సముద్రం వద్దకి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. జోరు వర్షంలోనే పోలీసులు సముద్రం వద్ద పహారా కాస్తున్నారు.