నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి ఉమా మహేశ్వరస్వామి శివదీక్ష ఆలయ వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వైసీపీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గురువారం స్వీకరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల దీక్ష (41 రోజులు)ను మహాశివరాత్రి విరమింపచేస్తామని కాటసాని అన్నారు. 1991లో దీక్షను ప్రారంభించి, కొనసాగిస్తున్నాని తెలిపారు.