గద్వాల్: ప్రజావాణి కార్యక్రమంలో 69 ఫిర్యాదుల స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కుమార్
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 69 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.