హిమాయత్ నగర్: మాదన్నపేటలో 10 లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్
పాతబస్తీలోని మాదన్నపేట పాత ఈద్గా వెనుక 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సిసి రోడ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ అధికారులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు రోడ్డును అందుబాటులో తీసుకురావాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలు పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.