ఆకాంక్షిత మండలంలో అభివృద్ది పనులు బాగా జరుగుతున్నాయని కేంద్ర ప్రభారి అధికారి శ్రీనివాసరావు వీరగంధం అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆస్పరేషనల్ బ్లాక్ కింద జిల్లాలోని యర్రగొండపాలెం మండలంలో జరుగుతన్న అభివృద్ది పనుల పర్యవేక్షణకు నియమితులైన ప్రభారి అధికారి శ్రీనివాసరావు వీరగంధం శుక్రవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆకాంక్షిత మండలంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 39 అంశాలలో కొన్ని అంశాల్లో వంద శాతం లక్ష్యాలను సాధించారని, మిగిలిన అంశాలపై కూడా శ్రద్ద చూపాలన్నారు. క్షేత్ర పర్యటనలో వివరించారు.