అనంతపురం జిల్లా రేకుల కుంటలో ఎద్దు పొడిచి బాలికకు గాయాలు
Anantapur Urban, Anantapur | Sep 14, 2025
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం లోని రాయదుర్గం మండలం రేకులకుంట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వ్యవసాయ పొలంలో ఎద్దు పొడిచి రాధిక అనే బాలికకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆదివారం రాత్రి అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.