అనంతపురం జిల్లా కనగానపల్లి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Sep 14, 2025
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని కనగానపల్లి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కనగానపల్లికి చెందిన ముత్యాలప్ప అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన తనని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.