ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు గురువారం స్థానిక పోలీసులు వెల్లడించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డ్రోన్ సహాయంతో చిత్రీకరించిన వీడియోని సోషల్ మీడియాలో పోలీసులు పోస్ట్ చేసి ప్రజలను హెచ్చరించారు. గంజాయి నిర్మూలన పేకాట కోడిపందాలు అరికట్టే అంశములు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్క ప్రాంతంలో నిఘా పెంచినట్లు తెలిపారు.