పులివెందుల: నియోజకవర్గంలో కొనసాగుతున్న వైసీపీ నాయకుల కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
Pulivendla, YSR | Oct 27, 2025 రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పులివెందుల నియోజకవర్గంలో కొనసాగుతోంది. సోమవారం సింహాద్రిపురం, వేముల, చక్రాయపేట మండలంలో వైసీపీ మండల నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో జరిగే నష్టాలను ప్రజలకు వివరించి సంతకాలు చేయించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.