అల్వాల్ డివిజన్లో ముత్యం రెడ్డి నగర్ ఫేస్ 1,2 లో 7.7 లక్షల వ్యయంతో రూపొందించిన ల్యాండ్ స్కేప్ పార్కులు, బోర్ వెల్స్, సిట్టింగ్ బెంచీలు, పాత్ వే లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే భారతి నగర్ లో 18 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్వాల్ డివిజన్లో ప్రతి కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాల పరిరక్షణలో కృతనిచ్చేయడం యధావిధిగా కొనసాగుతుందని అన్నారు.