విద్యార్థుల సౌకర్యార్థం సమయానికి బస్సులు నడపాలని డీ వై ఎఫ్ ఐ నాయకుల ఆధ్వర్యంలో గురువారం గుంతకల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. డీ వై ఎఫ్ ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు మాట్లాడారు. సమయానికి బస్సులు రాకపోవడంతో వివిధ గ్రామాల నుంచి పట్టణానికి వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.