నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని పాలకొల్లు గ్రామంలో గురువారం విషాదం చోటు చేసుకుంది, కర్నూలుకు చెందిన వినయ్, అస్లాం అనే బాలురు చెరువులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు, అస్లాం వినయ్ సహా మరో నలుగురు ఈత కొట్టేందుకు వచ్చారు, చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో ఈత కొట్టలేక వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు, కుమారుల మృతితో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు, పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు