దేవాలయాల అభివృద్ధికి సహకరించండి : ఎమ్మెల్యే శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి శనివారం తిరుమల జేఈవో వెంకయ్య చౌదరి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జేఈఓను మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి ప్రతిమ, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం శ్రీకాళహస్తిలోని దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.