చెన్నై, ఒంగోలు మరియు విజయవాడ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నర్సాపూర్ వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 15న నర్సాపూర్ నుంచి డిసెంబర్ 17న చెన్నై నుంచి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం అవుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు అన్నారు. చెన్నై నుంచి ఉదయం ఐదు గంటల 30 నిమిషాలకు బయలుదేరే వందే భారత్ ఒంగోలుకు ఉదయం 10 గంటల 9 నిమిషాలకు చేరుతుందని అనంతరం నర్సాపూర్ నుంచి మధ్యాహ్నం రెండు గంటల 50 నిమిషాలకు బయలుదేరి సాయంత్రం 6:29 నిమిషాలకు చేరుతుందని తెలిపారు.