అనంతపురం నగర శివారులోని వడియం పేట వద్ద ట్రాక్టర్ ను ఢీకొన్న కారు, ఇద్దరు యువకులకు గాయాలు
Anantapur Urban, Anantapur | Oct 18, 2025
అనంతపురం నగర శివారులోని వడయంపేట వద్ద ఉన్న జాతీయ రహదారిపై ట్రాక్టర్ ను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. గాయపడిన వారిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.