మార్కాపురం జిల్లా రాచర్ల మండలం రంగారెడ్డి పల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై సిఐ రామకోటయ్య రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలకు రక్షణ కల్పించుకోవాలని తెలిపారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకొని జరిమానాలు విధిస్తామని గురువారం సీఐ రామకోటయ్య వెల్లడించారు.