వాట్సాప్ లో వచ్చే తెలియని లింకులను APK పైళ్లను క్లిక్ చేసి సైబర్ నేరగాల వలలో పడవద్దని రుద్రవరం ఎస్సై జయప్ప అన్నారు, శనివారం రాత్రి రుద్రవరం మండల పరిధిలోని ఆలమూరు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ఎస్సై జయప్ప మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లోనూ అపరిచితుల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని ప్రజలకు తెలియజేశారు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు