అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఓబుళపతి అనే భర్త పై అతని భార్య వరలక్ష్మి రోకలిబండ తో దాడి చేసి గాయపరిచిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.