శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ రోజు రోజుకీ పెరుగుతోంది.మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం,నేడు కైలాసద్వారం పాదయాత్ర ద్వారా ఒక్క రోజే 23,984 మంది భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు.గత ఐదు రోజుల బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 99,887 మంది పాదయాత్ర ద్వారా శ్రీశైలానికి విచ్చేశారు.ఇక ఐదు రోజుల వ్యవధిలో సుమారు 2 లక్షల 28 వేల 901 మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.వీరిలో 66,896 మంది శివదీక్ష భక్తులు ఉన్నారు.మరో ఐదు రోజులు కూడా బ్రహ్మోత్సవాలువిజయవంతంగా, అద్భుతంగా జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.