దర్గా మెట్టుకు చెందిన ఓ 70 ఏళ్ల వృద్ధురాలు మున్సిపల్ శాఖలో పనిచేస్తూ రిటైర్డ్ అయింది. ఈ క్రమంలో రిటైర్మెంట్ తర్వాత వచ్చిన నగదును కొడుకు తీసుకొని ఇబ్బంది పెడుతున్నాడని ఆమె నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. పెన్షన్ డబ్బులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దాంతోపాటు జలదంకి చెందిన వృద్ధ దంపతులు సైతం తమ కుమారుడు ఇబ్బంది పెడుతున్నాడు అంటూ ఫిర్యాదు చేయడంతో సత్వరమే న్యాయం చేస్తారని ఎస్పీ సోమవారం హామీ ఇచ్చారు..