యువతకు ఉపాధి కల్పించడమే సీఎం లక్ష్యం: ఎంపీ పార్థసారథి
యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం పెనుకొండ మండలం అమ్మవారిపల్లి గ్రామం దగ్గర KIA ఇండస్ట్రీస్ హబ్ PHA ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మాణానికి ఎంపీ భూమి పూజ చేశారు. ఎంపీ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్కు అనేక పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు.