ప్రకాశం జిల్లా కంభం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై నరేందర్ రెడ్డి అనే వ్యక్తి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు మార్కాపురం మండలం పీడుదల నర్వ అనే గ్రామాన చెందిన వ్యక్తిగా రైల్వే పోలీసులు గుర్తించారు. అయితే మృతుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో విచారణలో తెలియవలసి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.