నంద్యాల జిల్లా డోన్లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పీజీఆర్ఎస్, రచ్చబండ కార్యక్రమాలు జరిగాయి. తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం, పెన్షన్లు, గృహ నిర్మాణ సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున వినతులు అందజేశారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ప్రజల చెంతకే పాలన అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.