జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొని గోకుల్ థియేటర్ నుంచి జూబ్లీహిల్స్ తెలంగాణ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, టిఆర్ఎస్ పాలనలో లభించిన సబ్సిడీలు నిలిచిపోయాయని విమర్శించారు.