పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి జోన్ పరిధిలోని 11 పోలీస్ స్టేషన్లోలో ప్రసాద్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మల్లాపూర్ లోని విఎన్ఆర్ గార్డెన్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 529 మంది యువకులు, పోలీస్ అధికారులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిపి పద్మజ, ఏసిపి చక్రపాణి, ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.