ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు కార్యకర్తలు వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి ఎమ్మెల్యే స్వగృహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టపాసులు పేల్చి సంబరాలు చేశారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపారు