కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని బస్టాండు వద్ద 13,14,15,17 వార్డుల నాయకులతో సోమవారం కమలాపురం మాజీ ఎమ్మెల్యే,వైయస్సార్సిపి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ఎస్ ఇ సి సభ్యులు సత్య సాయినాద్ శర్మ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు పేద విద్యార్థులకు విద్యా వైద్యం అందించే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 12వ తేదీన కమలాపురం గ్రామ చావిడి నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు జరిగే ర్యాలీని విజయవంతం చేయండని పిలుపునిచ్చారు.