ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎంపీపీ వెంకటరెడ్డి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు శుక్రవారం మంగళగిరి బయలుదేరారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఇకనుంచి తాను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడని పేర్కొన్నారు. పొదిలిలో విలేకరుల సమావేశంలో అధికారికంగా ప్రకటించి వెళ్లారు.