తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ శివగంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఆదివారం విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. రూరల్ పరిధిలోని ఐశ్వర్య విల్లాస్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని, లైసెన్సు లేని వాహనదారులపై జరిమానా విధించారు. రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పాటించకపోతే చర్యలు తప్పవని సీఐ వాహనదారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కాటయ్య పాల్గొన్నారు.