కడప జిల్లా బద్వేల్ మండలం తిమ్మరాజుపల్లె పాఠశాలలో సోమవారం వైద్యాధికారులు ప్రపంచ ఎయంఆర్ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తొట్టిగారిపల్లె వైద్యాధికారి వినయ్ కుమార్ మాట్లాడుతూ చిన్నచిన్న జబ్బులకు వైద్యుని అనుమతి లేకుండా ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ వాడటం ప్రమాదకరమన్నారు. సొంతంగా మందులు వాడితే శరీర రోగనిరోధక శక్తి తగ్గి అనారోగ్యం కలుగుతుందన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, లార్వా నిర్మూలనతో దోమలను అరికట్టవచ్చని తెలిపారు. గ్రామంలో జ్వరాలు, లార్వా సర్వేలను వైద్యాధికారులు చేపడుతున్నట్లు ప్రజలు సహకరించాలని కోరారు.