పూతలపట్టు: కాణిపాకం ఆలయంలో ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పై ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు “స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం ఈ రోజు శ్రీ స్వామివారి దేవస్థానంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ దేవస్థానం సిబ్బందితో కలిసి అతిథి గృహంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ స్వీకరించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఆలయ మాడా వీధులలో స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓలు ధనంజయ, ఎస్.వి. కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్లు కోదండపాణి, బాల ర