రాయదుర్గం: మురడి గ్రామంలో భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్టు, వివరాలు వెల్లడించిన సిఐ
డి.హిరేహాల్ మండలంలోని మురడి గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు బుధవారం మద్యాహ్నం రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సిఐ వెంకటరమణ వెల్లడించారు. ఈనెల 20 న మురడి గ్రామంలో నాగమణి ని భర్త హనుమంతరాయుడు గౌడ్డలితో దారుణంగా నరికి చంపాడని తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసి బుధవారం ఉదయం కళ్యం సమీపంలో నిందితున్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.