ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు 58వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వేంపల్లె శాఖ గ్రంధాలయ అధికారిణి వనజ కుమారి అన్నారు. 14న పిల్లల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న గ్రంధాలయ పితామహులకు నివాళి, 17న వ్యాసరచన పోటీలు, 18న చిత్రలేఖన, 19న మహిళా దినోత్సవం, 20న వారోత్సవ ముంగిపు వేడుకలతో పాటు గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఈ వారోత్సవాల్లో అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనాలని కోరారు.