చిన్నపిల్లలు న్యూమోనియా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశ వాలంటీర్లకు డాక్టర్ పూజిత మంగళవారం సాయంత్రం మనుబోలులో అవగాహన కల్పించారు. బుధవారం న్యూమోనియా డే సందర్భంగా ఆమె మాట్లాడుతూ జలుబు తుమ్ములు దగ్గు పిల్లలలో తరచూ వస్తుంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించాలని సూచించారు.. గ్రామాల్లో ఆశావాలంటీర్లు సర్వే చేసి చిన్న పిల్లలు న్యూమోనియా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.