నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఎం. పెండేకల్లు గ్రామ పంచాయతీ చెరువులోని మట్టిని కల్లూరు మండలం ఉలిందకొండకు అక్రమంగా తరలిస్తుండటాన్ని గ్రామ రైతులు అడ్డుకున్నారు. చెరువులో మట్టి తవ్వకాలు జరపవద్దంటూ రైతులందరూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల అధికారులు స్పందించారు. తవ్వకాలు జరుగుతున్నంత కాలం పట్టించుకోని అధికారులు, కలెక్టర్ ఆదేశాల తర్వాత మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేశారు.