మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కుర్చీల ఆటలో చిన్నారులు, పెద్దలు పాల్గొని ఉత్సాహంగా ప్రజలలో ఉత్సాహాన్ని నింపారు. పోటీలలో ప్రతిభ చాటిన వారికి ఎమ్మెల్యే నారాయణరెడ్డి నగదు బహుమతులు అందజేశారు. సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోరాదని సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేసే విధంగా పోటీలు నిర్వహించిన వాసవి క్లబ్ వారిని అభినందించారు.