ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మార్వో విజయభాస్కర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కార్మికుల చట్టాలను కాలరాస్తూ లేబర్ కోడ్స్ తీసుకురావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, భవన కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.