ప్రభుత్వ ఖాళీ స్థలాల వివరాలు వారం రోజుల్లోగా నివేదిక రూపంలో అందజేయాలని చిత్తూరు తహసిల్దార్ కులశేఖర్ అన్నారు. బుధవారం రెవెన్యూ సిబ్బందితో ఆయన పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ ఇందిరమ్మ కాలనీ జగనన్న కాలనీ దొడ్డిపల్లి వద్ద ఉన్న ఖాళీ స్థలాల వివరాలను సేకరించాలని తెలిపారు అలాగే ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కబ్జాదారుల వివరాలను కూడా సేకరించాలని చెప్పారు.