బాల్య వివాహాలు లేని సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సంజామల ఎంపీడీవో సాల్మన్, తహశీల్దార్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ICDS సూపర్వైజర్ శాంత ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలని సూచించారు. KGBV పాఠశాలలో ర్యాలీ, మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు