పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి 232 అర్జీలను స్వీకరించిన అధికారులు
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో సోమవారం మధ్యాహ్నం ఇన్ఛార్జి డి ఆర్ ఓ సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీవో సువర్ణ, డీపీవో సమత ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అక్కడికి వచ్చిన ప్రజల నుంచి 232 అర్జీలను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. అర్జీ దారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, నిర్లక్ష్యం వహించరాదని అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి 62, పెనుకొండ 70, ధర్మవరం 45, కదిరి 46 మొత్తం 232 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.