అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన అర్జున్ కుమార్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అతనిని వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.