వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన తల్లి మృతి చెందింది అంటూ మృతురాలి కుమార్తె పార్వతి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి 8:30 గంటల సమయంలో ఆందోళన వ్యక్తం చేసింది. అనంతపురంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ నెల 10వ తారీఖున కృష్ణమ్మ అనే వృద్ధురాలిని అనారోగ్యంతో ఆసుపత్రులు చేర్పించింది. బత్తలపల్లి మండలం ఎర్రాయపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. తన కూతురు పార్వతి అనంతపురంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించింది. గుండె పనితీరు సరిగా లేదని వైద్యులు నిర్ధారించారు. దీనికోసం ఫేస్ మేకర్ను అమర్చాలని సూచించారు.